ఎదులాపురం,డిసెంబర్17: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీస్ కానిస్టేబుల్ ,ఎస్ఐ ఉద్యోగార్థులకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు 1470 మంది అభ్యర్థులకు గాను 1292 మంది హాజరయ్యారు. 178 మంది గైర్హాజరయ్యారు. 666 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి, తుదిరాత పరీక్షకు అర్హత సాధించారు. 626 అభ్యర్థులు ఈవెంట్స్లో విఫలమయ్యారు. అదనపు ఎస్పీ సీ సమయ్జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సీహెచ్ నాగేందర్, ఐ జీవన్ రెడ్డి ఎస్ సుందర్రావు, పోలీస్ కార్యాలయం ఎస్వో యూనుస్ అలీ, సూపరింటెండెంట్లు జోసెఫిన్, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఐటీ కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బంది ఉన్నారు.