బోథ్, డిసెంబర్ 15 : మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాధనాశూరుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విన్యాసాలు ఏర్పాటు చేయించారు. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లికి చెందిన సదానందం, రాజు, రాజేశ్వర్ బరువులు ఎత్తడం, తదితర వాటిని ప్రదర్శించారు. ప్రతి ఏటా బోథ్తో పాటు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సాధన శూరులు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మేర్గు భోజన్న, గౌరవాధ్యక్షుడు గంగుల మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.