ఇంద్రవెల్లి, డిసెంబర్14 : నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలతోపాటు ఆలయ ప్రారం భోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యా త్మిక ప్రవచనాల బోధనాలు బుధవారం మూడో రోజూ రాత్రీ పగలు కొనసాగాయి. తరలివస్తున్న భక్తులతోపాటు మెస్రం వంశీయులకు కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కుమ్ర దత్తుమహారాజ్, మరప పుండలిక్మహారాజ్ భక్తులకు ఆధ్మాత్మిక ప్రవచనాలు బోధించారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు, మెస్రం వంశీయులు నాగోబాను దర్శించు కుంటూ పూజలు చేస్తున్నారు. దర్శించుకున్న భక్తులు ఆలయ స్తంభాలపై చెక్కిన వివిధ రకాల పడియోరు శిల్పాలను ఎంతో ఆసక్తిగా తిలకి స్తున్నారు. ఏర్పాటు చేసిన వలంటీర్లు భక్తులకు విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రంలో మెస్రం వంశీయుల ప్లాస్టిక్ ఇస్తార్లను నిషేధిం చారు. వారి సంప్రదాయ ప్రకారం భక్తులకు టేకు ఆకులతోపాటు మోదుగాకులు అందిస్తున్నారు. కేంద్రానికి భోజనాల కోసం వెళ్లి భక్తులు సంతో షంగా ఆకుల్లో తింటున్నారు. ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.