ఇచ్చోడ, నవంబర్ 29 : జిల్లాలోని ప్రతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్సీ)లు, అంబాసిడర్లు వయోజనులను ఓటర్లుగా నమోదు చేయాలని స్వీప్ నోడల్ అధికారి బీ లక్ష్మణ్ కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గౌతమి డిగ్రీ కళాశాల, మండల కేంద్రంలోని సాయి సమర్థ్ డిగ్రీ కళాశాలలో మంగళవారం పర్యటించారు. విద్యార్థులందరూ తమ ఇంట్లోని వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు. డిసెంబర్ 8 వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్, ఎన్వైకే కార్యకర్తలు స్వచ్ఛందంగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హన్మండ్లు, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, రవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
ఉట్నూర్ రూరల్, నవంబర్29 : 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఉట్నూర్ ఆర్డీవో కదం సురేశ్ కోరారు. మంగళవారం స్థానిక యూత్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. యువ సంఘాలు తమ సభ్యులతో విస్తృతంగా ప్రచారం చేయించాలని కోరారు. డిసెంబర్ 12 ఓటరు జాబితాలో పేర్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, యూత్ సభ్యులు పాల్గొన్నారు.