ఆదిలాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తాళం వేసి ఉన్న ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ దాడులు సిగ్గుచేటని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గు రామన్న అన్నారు. క్యాంప్ కార్యాలయం లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం బెదిరింపు చర్యలకు బీఆర్ఎస్ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు.
బీసీ నాయకుల ఎదుగుదలను ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం పనికిమాలిన చర్యలకు పాల్పడుతుందన్నారు. గతంలో నిష్పక్షపాతంగా వ్యవహరించే ఈడీ, ఐటీ లాంటి కేంద్ర సంస్థలు ఇప్పుడు బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని విమర్శించారు. మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కష్టపడి వ్యాపారం చేసి పైకి వచ్చిన బీసీ నాయకులపై ఈడీ దాడుల పేరిట కేంద్ర ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసున్నారని, ఆదానీ, అంబానీ లాం టి వారిపై ఎందుకు దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆ పార్టీ జేబులు నింపే పెట్టుబడిదారులపై దా డులు చేయించాలని సూచించారు. అణచివేసే ప్రయత్నాలను మానుకోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్ర జలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అజయ్, ఆశ్రఫ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిల్లర రాజకీయాలు మానుకోవాలి
బోథ్, నవంబర్ 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీలతో చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ హెచ్చరించారు. మండలకేంద్రంలో గు రువారం సాయంత్రం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి గం గుల కమలాకర్ను అగౌరవ పరిచేలా కేంద్రం దాడులకు పాల్పడిందన్నారు. నిజాయతీగా ఐ టీ అధికారులు లాకర్ తెరిచి చూసే లా మంత్రి సహకరించడం నిజాయతీకి నిదర్శనమన్నా రు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయా న్ని తట్టుకోలేని బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని, ప్రజలే గుణపా ఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.