ఎదులాపురం, నవంబర్ 9 : నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఎసీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో నంబర్ ప్లేట్లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్లో బుధవారం 125 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశామని తెలిపారు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, అందులో భాగంగా మూడు రోజులుగా నంబర్ ప్లేట్లు లేని 350 వాహనాలకు సీజ్ చేశామన్నారు. నంబర్ ప్లేట్లు వేయించిన తర్వాత విడిచి పెడుతామని పేర్కొన్నారు.
13 ద్విచక్ర వాహనాలు సీజ్
ఇంద్రవెల్లి, నవంబర్ 9 : మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్స్ లేని 13 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ సునీల్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ భీంరావ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.