ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 8 : కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం వేకువజామునే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆదిలాబాద్లోని శ్రీరామ చంద్రగోపాల కృష్ణ దేవాలయంలో పీఠాధిపతి యోగానంద సరస్వతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కాగడ హారతులు వెలిగించి పూజలు చేశారు. దీపం దానం, గోపూజ చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ముగ్గులు వేసి దీపాలతో అలంకరించారు. పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ఆలయాల్లో సందడి కనిపించింది. దీపాలతో ఆలయాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.