బాసర, నవంబరు 3 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇన్చార్జి వీసీ వెంకట రమణ పేర్కొన్నారు. బాసర ఆర్జీయూకేటీలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీలోని కాకతీయ గ్రౌండ్లో క్రికెట్ నెట్ ప్రాక్టీస్, క్యాంపస్లోని సెక్యూరిటీ అవుట్పోస్టు కార్యాలయం, బాలికల శౌచాలయంలో నూతనంగా బిగించిన తలుపు లు,నూతన ఫైనాన్స్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర సేవలను అందించేందుకు సెక్యూరిటీ అవుట్ పోస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం అంతర్జాతీయ హ్యకథాన్కు ఎంపికైన విద్యార్థులతో పాటు అథ్లెటిక్స్ క్రీడల్లో రాణించిన విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. క్యాంపస్లో నూతనంగా చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. డైరెక్టర్ సతీశ్కుమార్, అడ్మిని స్ట్రేటివ్ దావులు, ఫైనాన్స్ ఆఫీసర్ అనిల్, అసోసి యేట్ డీన్, చీఫ్ వార్డెన్, స్టూడెంట్ వెల్ఫెర్ ఆఫీసర్, సివిల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ క్యాంపస్ బ్యూటీఫికేషన్ టీం, క్యాంపస్ వైద్య బృందం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు.