లోకేశ్వరం, జూన్ 24 : అన్ని రకాల నేలలకు అనుకూలమైన ఆయిల్ పామ్ పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్, పంచగుడి గ్రామాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం మండల నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశవిదేశాల్లో సైతం నూనె ఉత్పత్తులు, ఔషధాలు, అత్తరు, తదితర తయారీల్లో ఆయిల్ పామ్కు మంచి గిరాకీ ఉన్నదన్నారు.
రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటల సాగు కోసం ఇన్పుట్, డ్రిప్ 90 శాతం సబ్సిడీ ద్వారా అందించనున్నదని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిపెట్టాలని సూచించారు. మొక్కలు నాటిన 3 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వరకు ఉండే పంట కాలంలో అధిక దిగుబడులతో ఎక్కువ లాభాలు గడించవచ్చని చెప్పారు. అంతర పంటలుగా శనగ, వేరుశనగ, పెసర, మినుములు, సోయా, నువ్వులు, పొద్దు తిరుగుడు, మక్క, అరటి, కూరగాయలు కూడా సాగుచేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితాభోజన్న, సర్పంచ్ శైలజానరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు బండి ప్రశాంత్, నాయకులు చిన్నారావు, మెండే శ్రీధర్, సాలాయి నరేశ్, సల్ల నర్సారెడ్డి, ఏఈవో మౌనిక, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మినీ కిట్స్ స్కీమ్ కింద వచ్చిన స్వల్పకాలిక రకం కందులను జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితాభోజన్న ఆధ్వర్యంలో కిష్టాపూర్ రైతులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) మినీ కిట్స్ స్కీం కింద వచ్చిన స్వల్ప కాలిక రకం కందుల మొలక శాతం దిగుబడులను తెలుసుకునేందుకు మండల రైతులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు లింగన్న, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు కపిల్, నాయకులు చిన్నారావు, గణపతి రెడ్డి, సుధీర్ రెడ్డి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.