చెన్నూర్, జూన్ 17: చెన్నూర్ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంబంధిత అధికారలను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నూర్ మున్సిపాలిటీలో శుక్రవారం పర్యటించారు. ఫేజ్-1 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. పనులు గడువు లోపల పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముదిరాజ్ కుల సంఘం, కాపు కుల సంఘం భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే సుమన్, ఎమ్మెల్సీలు దండె విఠల్, బండ ప్రకాశ్, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నిధుల నుంచి రూ.30 లక్షల చొప్పున మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రొసిగింగ్ కాపీలను కుల పెద్దలకు ఆయన అందజేశారు. అనంతరం పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాలా గౌడ్ను ఆయన పరామర్శించారు. ఇటీవల వివాహాం చేసుకున్న 7వ వార్డు కౌన్సిలర్ జగన్నాథుల శ్రీను దంపతులను ఆశీర్వదించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.
తాండూర్, జూన్ 17 : పల్లె ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాండూర్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ప్రతి ఇంటి ఆవరణలో 6 మొక్కలు నాటాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సర్కారు దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాల అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈ ప్రభాకర్ను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకొని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మండలంలోని తాండూర్, కిష్టంపేట గ్రామాల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లేదా రోడ్ లెవెల్ క్రాసింగ్ ఏర్పాటు చేయాలని కోరగా నేషనల్ హైవే అథారిటీ ఆధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఇన్చార్జి సర్పంచ్ పూదరి నవీన్కుమార్, కాసిపేట, రాజీవ్నగర్ సర్పంచ్లు అస్ప రమేశ్, క్రిస్టఫర్, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, మండల కో ఆప్షన్ సభ్యుడు నజ్జీఖాన్, ఎంపీడీవో ప్రవీణకుమార్, ఎంపీవో సత్యనారాయణ, విద్యుత్ ఏఈ ప్రభాకర్, ఎస్ఐ సమ్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సింగిల్విండో చైర్మన్ సుబ్బ దత్తు మూర్తి, ప్రదాన కార్యదర్శి రహమత్ఖాన్, కోశాధికారి మద్దికుంట రాంచందర్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు కంపెల చిన్నయ్య, ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్గౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీశ్, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బియ్యాల నిఖిల్, కార్యదర్శి తపాస్కుమార్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, జూన్ 17: మండలంలోని కెస్లాగూడలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, కొటారి, మోడి, ఝరి గ్రామాలో కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ పర్యటించారు. పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలు, శ్మశాన వాటికలతో పాటు గ్రామంలోని ప్రతి వాడలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందుతుందని, ప్రతి రోజూ బడికి వెళ్లాలని చిన్నారులకు సూచించారు. సెగ్రిగెషన్ షెడ్ను సందర్శించి సూచనలు చేశారు. కేజీబీవీలో అదనపు మరుగుదొడ్లు కావాలని, తాగునీటి సమస్య, కళాశాల భవనానికి స్థలం కేటాయించాలని ప్రత్యేక అధికారి మీనా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మోడి గ్రామంలో మొక్క నాటారు. ఈ కార్యక్రరమంలో అడిషనల్ డీఆర్డీవోలు కుటుంబరావ్(ఈజీఎస్), శ్రీనివాస్(సెర్ప్), ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో సుదర్శన్, ఏపీవో నగేశ్, ఏపీఎం జగదీశ్, సర్పంచ్ కుమ్రం నాణేశ్వర్, సీసీ, టీఏలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 17 : కాసిపేట మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ముత్యంపల్లిలోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఉయ్యాలలో కాసేపు కూర్చొని ఊగి సేద తీరారు. ప్రకృతి వనం నిర్వహణపై అభినందించారు. ఎంపీడీవో ఎంఏ అలీం, సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీవో నాగరాజు, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు, కార్యదర్శి మేఘన పాల్గొన్నారు.