నేరడిగొండ, మే 19 : వానకాలం దగ్గర పడుతున్నది.. వ్యవసాయ పనులకు ఎడ్లు ఎంతో అవసరం.. వాటిని కొనేందుకు ఇద్దరు రైతులు ఇంటి నుంచి బైక్పై బయలు దేరారు. కానీ తిరిగి రాలే దు. వచ్చేటప్పుడు వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. మండలంలోని జాతీయ రహదారిపై కుప్టి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెం దారు. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల మేర కు.. సిరికొండ మండలం సుంకిడి గ్రామానికి చెం దిన రాథోడ్ సుభాష్ (40), జాదవ్ కిషన్(62) రైతులు. వానకాలం సీజన్ దగ్గరపడడంతో వ్యవసాయ పనుల కోసం వీరికి ఎడ్లు అవసరమయ్యా యి. కొనేందుకు బోథ్ మండలం కుచ్చిరాల గ్రా మానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో చీకటిపడింది. వీరు బైక్పై వస్తుండగా.. కుప్టి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలై అ క్కడికక్కడే మృతి చెందారు. కిషన్ మృతదేహం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్య లు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరూ పేద రైతులే. రాథోడ్ సుభాష్కు ఎకరం భూమి ఉంది. రెండేండ్లుగా ఆయన సిరికొండలో ఫాస్ట్ఫుడ్ సెం టర్ నడుపుతున్నాడు. ఇటీవల వ్యాపారం మూసేసి తన భూమితో పాటు మరో మూడెకరాలు కౌలు కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. జాదవ్ కిషన్ కూడా తనకున్న మూడెకరాల్లో వ్యవసా యం చేసుకుంటున్నాడు. దీంతో వారికి అవసరమైన ఎడ్లు కొనేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సుభాష్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. కిషన్కు భార్య, కొడు కు ఉన్నారు. వీరి మృతితో సుంకిడి గ్రామంలో విషాదం నెలకొంది.