తానూర్, ఏప్రిల్ 1: గిరిజన రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం మండలంలోని బామ్ని తండాలో సీఎం గిరివికా సం పథకం కింద 25మంది గిరిజన రైతులకు మంజూరైన బోర్ మోటర్ పంపుసెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. గిరిజనులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు వారికి అవసరమైన వసతులను కల్పిస్తున్నదన్నారు. సర్కారు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పంచపులాబాయి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతరెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు బాషెట్టి రాజన్న, ఏపీవో గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు చంద్రకాంత్ యాదవ్, చంద్రశేఖర్, బండారి పోషెట్టి, అఠల్ దేవీదాస్ పాల్గొన్నారు.
రైతుల సౌకర్యార్థమే కొనుగోలు కేంద్రం
రైతుల సౌకర్యార్థమే ప్రభుత్వం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తునట్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముథోల్లోని గోదాంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంటను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.5100 చెల్లిస్తుందన్నారు. కార్యక్రమం లో పీఏసీఏస్ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ రాంరెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ సాగరబాయి-రాజ య్య, తాత్కాలిక సర్పంచ్ గంగాధర్, నాయకులు సురేందర్ రెడ్డి, బాబు పటేల్ ఉన్నారు.