ఆసిఫాబాద్, జనవరి 31: రైతులు కంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అ న్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎం పీపీ అరిగెల మల్లికార్జున్తో కలిసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుల కు ఈ ఏడాది మద్దతు ధర ఎకువగా ఉ న్నందునా, దళారులకు అమ్మి మోసపోవద్ద ని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే కందులను అమ్ముకోవాలన్నా రు. విక్రయించే సమయంలో పట్టా పాసుబుకు,ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ ప్రతిని కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్, మారెట్ కమిటీ కార్యదర్శి విజయ్, సింగల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ ,నాయకు లు గోపాల్ నాయక్, బాపురావు ఉన్నారు.