మామడ, ఆగస్టు 12 : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదా చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.
మండలంలోని రాసిమెట్ల గ్రామంలోని సీలింగ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విచారణ మూడు రోజుల పాటు కొనసాగుతుందని, అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.