ఎదులాపురం,అక్టోబర్ 17: ఒకప్పటి పోలీసుల ప్రాణత్యాగాల ఫలితమే ఇ ప్పటి ప్రశాంతమైన జిల్లాకు కారణమని జిల్లా ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్సలో రక్తదాన శిబిరం ఏ ర్పాటు చేశారు. ముందుగా జిల్లా ఎస్పీ అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిరన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 57 మంది పోలీసుల ప్రాణత్యాగాలు ఇప్పుడు ప్రశాంతమైన జిల్లాకు కారణమని గుర్తుచేశారు. వారి సంస్మరణ సందర్భంగా జిల్లా హెడ్క్వార్టర్స్లో అమరవీరుల ముఖచిత్రాలతో నూతన స్తూపాన్ని ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆదేవిధంగా ఈ రక్తదానం శిబిరం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఎక్కువ గా ఉన్నందున, ప్రజలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం శుభపరిణామ మన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బంది, పట్టణంలో వివిధ వార్డులకు సంబంధించిన ప్రజలు, యువజన సంఘాలు,ఉద్యోగులు 152 మందితో పాటు జిల్లా ఎస్పీ రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సీ సమయ్జాన్రావు, డీఎస్పీ వీ ఉమేందర్, ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, వర్టికల్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు కే.సత్యానారాయణ, ఏ.అశోక్, ప్రణయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్, ఆర్ఐ సీఐలు నవీన్ కుమార్, టీ.మురళి,కార్తీక్, స్వామి రిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సిబ్బంది ఉన్నారు.