ఉపాధ్యాయుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు మార్గం సుగమం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సాధారణ పరిపాలన శాఖ నిషేధంలో ఆగిపోయిన ప్రక్రియ.. తెలంగాణ సర్కారు ప్రత్యేక చొరవతో ఆస్కారం లభించింది. ఈనెల 27వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా.. 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,139 మంది ఉపాధ్యాయు లకు ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉండగా.. 5,900 మంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉండి. ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యా యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యల న్నింటికీ పరిష్కారం లభించినట్లయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఆదిలాబాద్, జనవరి 22(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఇస్తున్నది. పలు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నది. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు వెచ్చిస్తున్నది. ఈ పాఠశాలల్లో పౌష్టికాహారం, ఇంగ్లిష్ బోధన, క్రీడలు, ఇతర అంశాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సర్కారు స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల సంక్షేమ కోసం కూడా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది.
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టేందుకు సన్నాహాలు ఆరంభించింది. జాబితాల తయారీలో జిల్లా, మండల స్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయ ఖాళీలు, పదోన్నతుల కోసం అర్హులైన టీచర్ల జాబితాను మండల స్థాయిలో ఎంఈవోలు సిద్ధం చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, ఐదేండ్లు పూర్తి చేసుకున్న పీజీహెచ్ఎంలకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. ఎంఈవోలు మండలాలవారీగా కనీస సర్వీసు పూర్తి చేసుకున్న వారి లిస్టు కూడా పంపించారు. కాగా.. ఉపాధ్యాయులకు 2018 తర్వాత బదిలీలు జరుగలేదు. ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహించే బదిలీల ప్రక్రియలో జీవో నం. 317 కింద జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు మినహాయించి మిగితావారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభంకానుండగా మొదటి రోజు సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో పెడతారు. 28 నుంచి మూడు రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లకు, హెచ్ఎంలకు పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పిస్తారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 486 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉండగా 3 వేల మందికి బదిలీల కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ కోసం 207 ఖాళీలు ఉండగా.. ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. హెచ్ఎంలు 51 ఖాళీ ఉండగా.. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు లభిస్తాయి. నిర్మల్ జిల్లాలో 169 స్కూల్ అసిస్టెంట్లు, 59 పీజీహెచ్ఎం ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో వివిధ పాఠశాలల్లో 125 ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 183 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో దాదాపు 1,700 మంది బదిలీలకు అర్హులుగా ఉన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 83 ప్రధానోపాధ్యాయుల పోస్టులు, 262 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నివేదికలు తయారు చేశారు. జిల్లాలో 1,200 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 22 : ఏడున్నరేండ్లుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, నాలుగున్నర ఏండ్లుగా ఎదురు చూస్తున్న బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని టీఎస్ యూటీఎఫ్ నుంచి స్వాగతిస్తున్నాం. విద్యా రంగం బలోపేతం కావాలంటే పాఠశాలల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణ అవసరం. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు జిల్లాలో పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలుగాని, గతంలో ఉన్న ఖాళీల్లోగాని కొంత దామాషా ప్రకారం స్థానిక జిల్లాలకు పంపించి న్యాయం చేయాలి. భార్య, పిల్లలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. స్పౌజ్ బదిలీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. ట్రాన్స్ఫర్లలో జీరో సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి. బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం.
ఉపాధ్యాయులు చాలా కాలంగా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతామని ప్రకటించడంతో సంతోషంగా ఉంది. ఈ నిర్ణయంతో బోధనాపరమైన సమస్యలు తీరిపోతాయి. పాఠశాలలపై పర్యవేక్షణ పెరుగుతుంది. విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోతాయి. జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా స్పష్టత వస్తుంది.
– అనిల్కుమార్, ఉపాధ్యాయుడు, రెబ్బెన జడ్పీ పాఠశాల
బదిలీలు లేక, ఉద్యోగోన్నతులు లభించక ఒకేచోట చాలా రోజులు పని చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోన్న తులు చేపడుతామని చెప్పింది. ఇందుకు సంతోషంగా ఉంది. 317లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. అలాగే పండిట్లకు, పీడీలను అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. ఉద్యోగోన్నతులు, బదిలీలతో ఎస్జీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీంతో కొత్త రిక్రూట్మెంట్కు అవకాశం ఉంటుంది. బడులకు కొత్త ఉపాధ్యాయులు వస్తారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ప్రకటించినందుకు ఆనందంగా ఉంది.
-రాధాకృష్ణారెడ్డి, కాంప్లెక్స్ స్కూల్ హెచ్ఎం, సిరికొండ
మంచిర్యాల అర్బన్, జనవరి 22 : ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అవకాశం కల్పించడం మంచి నిర్ణయం. ఇందుకు సర్కారుకు ధన్యవాదాలు. 317 జీవో అప్పీళ్లు, కోర్టు కేసులు, స్పౌజ్ కేసులను సైతం పరిగణలోకి తీసుకుంటే మరింత బాగుండు. ఏప్రిల్ 23న రిలీవ్ కావాలన్న నిర్ణయం మంచిదే. బదిలీలు, పదోన్నతులతో విద్య మరింత పటిష్టమవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
– కాదాసి శారద, ఎంపీయూపీఎస్, నాగాపూర్, చెన్నూర్
కాగజ్నగర్, జనవరి 22 : నేను పదేళ్లు గా చీలపల్లి ఎంపీయూపీఎస్ పాఠ శాలల విధులు నిర్వహిస్తున్నా. ఇది మారుమూల గ్రామం. అనేక సమ స్యలు ఎదుర్కొంటూ పనిచేస్తున్నా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీలు చేపడుతామని ప్రకటించింది. ఇందుకు సంతో షంగా ఉంది. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బదిలీల్లో నా సొంత జిల్లాకు వెళ్లే అవకాశం వస్తుందేమోనన్న ఆశ ఉంది.
– పురుషోత్తం ఉపాధ్యాయుడు, ఎంపీయూపీఎస్ చీలపల్లి, సిర్పూర్(టీ) \సర్కారుది సరైన నిర్ణయం
కాగజ్నగర్, జనవరి 22 : ఏడేళ్లుగా ఉద్యోగోన్నతి లేదు. కొందరు ఉన్న ఉద్యోగంలోనే విరమణ పొందారు. నాకు 28 ఏండ్ల సర్వీసు ఉన్నా ఇం కా ఎస్జీటీగానే ఉన్నాను. ఈ సారై నా నాకు ఎస్ఏ వస్తుందనుకుం టున్నా. ఆలస్యమైనప్పటికీ ప్రభు త్వం సరైన నిర్ణయమే తీసుకున్నది. నాలాంటి వారికి ప్రమోషన్లు వస్తాయి. – భిక్షపతి, ఎంపీపీఎస్,
బురుదగూడ, సిర్పూర్(టీ) మండలం
ఇచ్చోడ, జనవరి 22 : మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖాలు మారాయి. ఉద్యోగోన్న తులు, బదిలీలకు అవకాశం కల్పించడంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు. బదిలీల కోసం వేచి చూసిన వారికి మేలు జరుగుతుం ది. ఇది శుభ పరిణామం. ఆన్లైన్లో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
-రమేశ్ నాయక్, ఉపాధ్యాయుడు, ఇచ్చోడ