సోన్, అక్టోబర్ 26 : తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అండగా ఉంటున్నామని, అలాంటి ప్రభుత్వానికే పట్టంకట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్రామాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. నిర్మల్లోని శాస్త్రినగర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పదేళ్లలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీ సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో సోన్ మండలం లోకల్ వెల్మల్ గ్రామానికి చెందిన 150 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
అలాగే పాక్పట్ల గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎలాల ముత్యంరెడ్డి, బీజేపీ మండల కార్యవర్గ సభ్యులు కొప్పెల ముత్యంరెడ్డి గులాబీ గూటికి చేరారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్కు చెందిన నాయకులు కూడా పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోన్ జడ్పీటీసీ జీవన్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినుద్దీన్, సర్పంచ్ ఎల్చల్ గంగారెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రవీణ్, కొప్పుల నర్సయ్య, ఆకుల రమేశ్, సదు గంగన్న, కర్రొల్ల చిన్నయ్య, విజయ్, కొప్పుల కృష్ణ, మాలేపు నితిన్ తదితరులు పాల్గొన్నారు.