ముథోల్, జనవరి 28 : సాంకేతిక రంగంలో రాణించడమే లక్ష్యమని బాసర ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ అన్నారు. నిజామాబాద్లో కాకతీయ శాండ్బాక్స్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘డెవలప్మెంట్ డైలాగ్’ కార్యక్రమంలో భాగంగా వీసీ వెంటకరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ పాల్గొని మాట్లాడారు. వివిధ కంపెనీల సీఈవోలతో ఆర్జీయూకేటీ విద్యావిధానం గురించి వివరించారు. ఐటీ పరిశ్రమ వికేంద్రీకరణపై జరిగిన చర్చాగోష్టిలో వీసీ పాల్గొన్నారు.
ఈ చర్చలో నిజామాబాద్లో మినీ టీహబ్ ఏర్పాటు చేయడం వల్ల ఆర్జీయూకేటీ బాసర విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ హాజరవగా, ఆర్జీయూకేటీలో జరిగిన గురురాజ్ దేశ్పాండే కార్యక్రమం గురించి వీసీ వివరించారు. అనంతరం వీసీ వెంకటరమణ, కాకతీయ శాండ్బాక్స్ సంస్థ, డాక్టర్ వీ చంద్రశేఖర్, సీఈవో నవీన్తో అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.