సారంగాపూర్, నవంబర్ 7 : పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన యాదవ కులస్తులు 500, బండరేవుతండాకు చెందిన 30, జామ్ గ్రామానికి యూత్ సభ్యులు 50, సోనాపూర్తండాకు చెందిన 450 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూడండి, గత రెండు పర్యాయాలుగా మీ వాడిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించారని, ఈ అభివృద్ధి ఇలాగే జరగాలంటే మూడోసారి తప్పకుండా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, సర్పంచ్ మురళీకృష్ణ మహిపాల్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, కండెల భోజన్న, ముద్రం దినేశ్, బోసాని భోజన్న, నిన్నోల్ల నర్సయ్య, ముండల రమేశ్, ప్రకాశ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి
సోన్, నవంబర్ 7 : ఎమ్మెల్యేగా మహేశ్వర్రెడ్డి పాలించినప్పుడు చేయలేని అభివృద్ధిని కేసీఆర్ నాయకత్వంలో చేశామని నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోన్ మండలం న్యూవెల్మల్ బొప్పారం, సంగంపేట్, కూచన్పెల్లి, సాకెర, కడ్తాల్, గంజాల్, సోన్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో మహిళలు, యువకులు, రైతులు అల్లోలకు మద్దతుగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఎలా మారిందో రాకముందు ఎలా ఉండేనో కళ్ల ముందే కనబడుతుందని తెలిపారు. రూ. 200 ఉన్న పింఛన్ను రూ. 2,016కు పెంచడం, రాబోయే రోజుల్లో రూ. 5వేలకు పెంచుతామన్నారు. పింఛన్లు రాని మహిళలకు జీవనభృతి కింద రూ. 3వేలు చెల్లిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 పెంచిందని దానిని రూ.400, గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇటువంటి పథకాలు ఎక్కడ కూడా అమలు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి గెలుపు కోసం చిన్నారుల సాయం…
సాకెర గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి హరిణి, చైత్ర అనే చిన్నారులు తాము దాచుకున్న కిడ్డీ బ్యాంక్లో డబ్బులను అందించి బీఆర్ఎస్ పార్టీ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, వైస్చైర్మన్ బర్మగంగాదాస్, ఆత్మచైర్మన్ గంగారెడ్డి, మండల ఇన్చార్జిలు ఆనంద్రెడ్డి, మహేశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, హరిత శ్రీనివాస్, మారి విలాస్, సుప్రజ, వినోద్, దాసరి శ్రీనివాస్, దాసరి రాజేశ్వర్, ప్రదీప్, ఆరె రాము, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.