బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
పార్టీ నాయకులతో సమావేశం
బెల్లంపల్లిటౌన్,ఆగస్టు 30 : కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ సముచిత స్థ్ధానం కల్పిస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పార్టీ నూతన పట్టణ, వార్డు, మండల, గ్రామస్థా యి కమిటీల నిర్మాణం కోసం నియోజకవర్గంలో ని ఏడు మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రూ. లక్ష ఎల్వోసీ అందజేత
బెల్లంపల్లి టౌన్/కాసిపేట,ఆగస్టు 30 : కాసిపేట మండలం దేవాపూర్ ఎస్సీ కాలనీకి చెందిన పోశంకు బెల్లంపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రూ.లక్ష ఎల్వోసీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం అందజేశారు. పోశం కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి పరిస్థితిని టీఆర్ఎస్వీ కాసిపేట మండల ప్రధాన కార్యదర్శి దుర్గం మహేందర్ ఎమ్మెల్యేకు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఆపరేషన్కు ముందే ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా పోశం కుటంబ సభ్యులు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
బుగ్గ దేవాలయంలో పూజలు..
బెల్లంపల్లి రూరల్, ఆగస్టు 30: కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు చేశారు. ముందుగా కన్నాల సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, ఆలయ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీ దేవి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, ఈవో పెండ్యాల వామన్రావ్, క్లర్క్ భాను, ఆలయ క మిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఎంపీటీసీ పీ సుభాష్రావు, టీఆర్ఎస్ నాయకులు మాసాడి శ్రీరాములు, జిల్లపల్లి వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.