క్షౌరశాలలు, లాండ్రీషాపులు, దోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
జిల్లాలో 1084 మంది లబ్ధిదారులు
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
నాయీ బ్రాహ్మణ, రజకుల హర్షం
కోటపల్లి, నవంబర్ 28 : తెలంగాణ ప్రభు త్వం నాయీ బ్రాహ్మణులు, రజకుల జీవితా ల్లో వెలుగులు నింపుతున్నది. ఇందులో భా గంగా క్షౌరశాలలు, లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ను అందిస్తూ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. ఈ రెండు వృత్తుల వారు ప్రధానంగా కరంట్పైనే ఆధార పడుతుండగా, ప్రతి నెల విద్యుత్ బిల్లు తడిసి మోపెడవుతున్నది. మీటర్లు రెండో కేటగిరీలో ఉండగా బిల్లులు పెను భారంగా మారాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకోగా, విజయవంతంగా కొనసాగుతున్న ది. 250 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి జీ రో బిల్లు వస్తున్నది. ఉచిత విద్యుత్ వల్ల తమ కు నెలకు రూ.1000 నుంచి రూ . 15 00 వరకు ఆదా అవుతున్నాయని నాయీబ్రాహ్మణులు, రజకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1084 మందికి ఉచిత విద్యుత్
జిల్లాలో ఇప్పటివరకు 1084 మంది లబ్ధి పొం దుతున్నారు. నాయీ బ్రాహ్మణలు 302 మం ది, 782 మంది రజకుల దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది. అర్హులైన వారు http: //tsobmms.gov.in సైట్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, విద్యుత్ కనెక్షన్ నంబర్, షాప్ ఫొటో తదితర వివరాలతో దరఖాస్తు చేసుకుంటే, అధికారులు విచారణ చేసి ఉచిత విద్యుత్ జాబితాలో వారి షాప్లను చేర్చుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా, లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నది.
గతంలో పట్టించుకోలేదు..
లాండ్రీ షా పులు, దోబీఘాట్లకు ప్రభుత్వం ఉ చితంగా 250 యూ నిట్ల వరకు విద్యుత్ అం దజేస్తుండడం ఆనందంగా ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా మా కుల వృ త్తుల గురించి కానీ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి.
-కొండపర్తి ప్రశాంత్, లాండ్రీ షాప్, చెన్నూర్