భైంసా, నవంబర్ 28 : గోపాల్రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల న్యాక్కు ఎంపికవడంపై ఆదివారం అధ్యాపకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు న్యాక్ బీ గ్రేడు రావడం సంతోషదాయకమన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, కళాశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం అధ్యాపకులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి స్వీట్లు తినిపించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శివప్రసాద్, యూ గంగాధర్, మధు, సుధాకర్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
కుభీర్, నవంబర్ 28 : మండలంలోని రాము నాయక్ గిరిజన తండాకు చెందిన రైతు జాదవ్ గులాబ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. స్వయంగా గ్రామానికి వెళ్లి బాధితులను ఓదార్చారు. రైతు బీమా ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఎమ్మె ల్యే వెంట మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, పానాజీ విజయ్కుమార్, ఎంపీటీసీ పంతుల హన్మాండ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.