ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
పీఆర్సీ అమలుపై సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సన్మానం
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 28 : రాష్ట్రంలోని ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. 30 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ అమలును హర్షిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఆదివారం ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి పీఆర్సీని ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం నాయకుడు పడాల రవీందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు, ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం బాధ్యులు ప్రకాశ్, హిమబింధు, జయశ్రీ, రాజేశ్వర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.