జిల్లావాసులు పోలీసులకు సహకరించాలి..
అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా..
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తా..
యువత ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని చేరుకోవాలి..
బాధ్యతల స్వీకరణలో నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్
నిర్మల్అర్బన్, డిసెంబర్ 27 : నిర్మల్ను నేరరహిత జిల్లాగా చేస్తానని జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ నమస్తే తెలంగాణతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లావాసులు పోలీ సులకు సహకరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులోకి ఉండి సమస్యలు పరిష్కరి స్తానని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తామని వివరించారు. యువత ప్రణాళి కాబద్ధంగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటామని, పోలీసు శాఖకు మచ్చ తీసుకొచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పలు అంశాలపై మాట్లాడారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు
ఎస్పీ : జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పకడ్బం దీ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఎలాంటి అల్లర్లు జరుగకుండా ముందస్తు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
నతె : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్పీ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాం. మైనర్లు వాహనాలను నడుపకుండా పోలీసులతో అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాం. ఆర్అండ్బీ, రోడ్డు రవా ణా, పోలీసు శాఖ సమన్వయంతో బ్లాక్ స్పాట్ లను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేశాం.
నతె : మహిళలపై దాడుల నివారణకు తీసుకుంటున్న చర్యలు
ఎస్పీ : మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులను నివారించేందుకు షీటీం ద్వారా అవగా హన కల్పిస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల్లో ఈవ్టీజింగ్ జరుగకుండా చర్యలు చేపట్టాం.
నతె : ట్రాఫిక్ వ్యవస్థ్ధ సరిదిద్దేందుకు మీ ప్లాన్
ఎస్పీ : జిల్లాలో ట్రాఫిక్ వ్యవస్థను సరిదిద్దేం దుకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది. బస్టాండ్ ప్రాంతంలో వీధి వ్యాపారులు రోడ్లపై వ్యాపారం నిర్వహిస్తుండడంతో సమస్య ఉత్పన్న మవుతున్నది. వీధి వ్యాపారులకు వేరే చోట స్థలం కేటాయిస్తే సమస్య తీరుతుంది.
నతె : అసాంఘిక కార్యకలాపాలను ఏవిధంగా అడ్డుకుంటారు.
ఎస్పీ : జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు లాడ్జీల నిర్వాహకులపై కేసు లు నమోదు చేశాం. రికార్డులు పూర్తిగా నిర్వ హించాలని ఆదేశించాం.
నతె : మత్తు పదార్థాల కట్టడికి చర్యలు
ఎస్పీ : జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అమ్మకాలపై నిఘాను విస్తృతం చేశాం. గంజాయి సాగు, రవాణా చేసే వారిపై 17 కేసులు నమోదు చేశాం. గుట్కా, గుడుంబాపై విస్తృతంగా దాడులు చేస్తున్నాం.
నతె : వీడీసీల తీర్పులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్పీ : చట్టాన్ని వీడీసీలు చేతులోకి తీసుకోవద్దు. చట్టాన్ని చేతులోకి తీసుకోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో ఇప్పటి వరకు 15 మందిపై కేసులను నమోదు చేశాం.