ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ఉద్యోగుల ప్రతిజ్ఞ
నిర్మల్ టౌన్, నవంబర్ 26 : డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని నలుదిశలా చాటుదామని ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. రా జ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉద్యో గులతో ప్రతిజ్ఞ చేయించారు.భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎస్ నటరాజ్ పాల్గొన్నారు. ఉద్యోగులతో కలెక్టర్ ప్రతి జ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో డీపీఆర్వో భీమ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, రాజేశ్వర్, స్వాతి, నలంద ప్రియా, తహసీల్దార్ రాంరెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్లో..
ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ముషార ఫ్ అలీ ఫారూఖీ తన కార్యాలయంలో నిర్వ హించారు. బీఆర్. అంబేద్కర్ దేశ పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు కల్పించారని పేర్కొన్నారు. సమసమాజ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ స్వాతంత్య్రం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అధికారులు రమేశ్ కుమార్, శ్రీనివాస్రెడ్డి, అంజుకుమార్, హన్మాం డ్లు, రమేశ్ రాథోడ్, తదితరులున్నారు.
రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి
రాజ్యాంగం ఎంతో గొప్పది
అందరికీ ఒకే రకమైన హక్కులు
–అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయప్రసాద్
ఎదులాపురం, నవంబర్ 26 : ప్రతి భారతీ యుడికి ఒకే రకమైన హక్కులుండేలా రాజ్యాంగం రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని అదనపు జిల్లా న్యాయమూర్తి టీ జయప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం డీఎల్ఎ స్ఏ సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్స వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజల స్థితిగతులు, వెనుకబాటు తనం, పేదరికం, అసమానతులు, అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని, భారతీయులందరూ సమాన హక్కులు విధి విధానాలు కలిగి ఉండాలనే ఉద్దే శంతో రాజ్యాంగాన్ని తయారు చేశారని పేర్కొ న్నారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేది ఒక పవిత్రగ్రంథమని, అందరూ హక్కుల ను తెలుసుకోవాలని సూచించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమదేశ్ పాండే, బార్ అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం రమణారెడ్డి, ఏ సంతోష్ కుమార్, పీపీలు సంజయ్ కుమార్ వైరగరె, మేకల మధూకర్, కేమ శ్రీకాంత్, న్యాయవాదులు సిబ్బంది ఉన్నారు.