నేడు, రేపు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
18 ఏండ్లు నిండిన వారికి అవకాశం
సద్వినియోగం చేసుకోవాలని యువతకు అధికారుల పిలుపు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 20,95,836 ఓటర్లు
నిర్మల్ టౌన్, నవంబర్ 26: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ఇప్పటికే విడుదల చేసిన అధికారులు ఓటరు జాబితాలో పేర్లు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవడం, చనిపోయిన వారి ఓటర్లను తొలగించడం, పోలింగ్ బూత్ల మార్పిడి తదితర అంశాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. 1.1.2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్ 2022) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఓటర్ల వివరాలివే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మొత్తం 20,90,836 ఓటర్లు కాగా.. నిర్మల్ జిల్లాలో 6,77,056, మంచిర్యాలలో 5,81,051, ఆదిలాబాద్లో 4,20,932, ఆసిఫాబాద్లో 4,06,790 ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారికి కొత్తగా ఓటు హక్కు కల్పించడం కాకుండా సమగ్ర ఓటరు జాబితాను రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 20,95,836 మంది ఓటర్లుండగా, ఇందులో 10,60,412 మంది స్త్రీలు, 10,35,315 పురుష ఓటర్లు, 109 మంది ఇతరులు, 61 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు నమోదై ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జా బితాలో పేర్లు లేని వారు, తప్పొప్పులు ఉన్న జా బితాను సరి చేయడం, ఓటర్ల తొలగింపు కోసం శని, ఆదివారాల్లో ఆయా బీఎల్వో కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఫాం నం. 6 ద్వారా కొత్త ఓటరు నమోదు, 7 ద్వారా జాబితా నుంచి ఓటర్ల తొలగింపు, ఫాం నెం. 8 నుంచి తప్పొప్పుల సవరణ, ఫాం 8 (ఎ) నుంచి చిరునామా మార్పిడికి అవకాశం ఇవ్వనున్నారు. ఆయా జి ల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటికే ఉమ్మడి జి ల్లాలో ప్రత్యేక ఓటర్ల నమోదు క్యాంపెయిన్పై వి స్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆటోల్లో ప్రచారంతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆన్లైన్ ఓటరు నమోదు, హెల్ప్లైన్, మొబైల్ యాప్పై అవగాహన కల్పిస్తుండడంతో ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. కొత్తగా చేరిన ఓటర్ల నుంచి మార్పులు, చేర్పులపై ఈనెల 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని డిసెంబర్ 12 లోగా పరిశీలించి జనవరి 5న తుది జాబితాను విడుదల చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓట రు నమోదు కార్యక్రమంపై విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నాం. ఆటోలు, ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పోలింగ్బూత్ల వద్ద ప్రచారం చేపడుతున్నాం. బీఎల్వో కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
-ముషారఫ్ అలీ ఫారూఖీ(కలెక్టర్, నిర్మల్ జిల్లా)