అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
దివ్యాంగుల వధూవరుల వివాహ పరిచయ వేదిక
ఎదులాపురం, నవంబర్ 26 : సంకల్ప బల ముంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చ ని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో సంరక్షణ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాప కుడు యేనగంటి విజయభాస్కర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల వధూవరుల వివాహ పరిచయ వేదిక ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులమని బాధపడకుండా ధైర్యంతో ముందడుగు వేయాలన్నారు. వివాహా లు చేసుకోవడం ద్వారా దివ్యాంగుల్లో మరింత మనోబలం పెరుగుతుందన్నారు. అందుకు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాం గుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకంలో చేరడానికి ఎదురుచున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం దివ్యాంగ వరుడు, సకలాంగ యువతి పరస్పర అంగీకారం తో ఇరు కుటుంబాల సహకారంతో వివాహం చేసుకోవడానికి ముందుకురావడంతో వారిని అతిథులు అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బావునే నగేశ్, యువజన సం ఘాల నాయకులు బాలశంకర్కృష్ణ, సాయి వైకుంఠ ట్రస్ట్ పర్యవేక్ష కుడు నవీన్కుమార్, తదితరులు పాల్గొన్నారు