అనుకూలంగా వాతావరణం
జిల్లాలో 68,584 ఎకరాల్లో సాగు
రైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే మరింత లాభం
దిగుబడి పెరిగే అవకాశం
ఇచ్చోడ, నవంబర్ 20: జిల్లాలో పత్తి, సోయాబీన్ పంటల తర్వాత కందిపంట అధికంగా సాగు అవుతున్నది. ఈయేడు జిల్లాలో 68,584 ఎకరాల్లో కంది సాగు చేపట్టినట్లు వ్యవసాయాధికారులు తెలిపా రు. పంటకాలం అధికమైనప్పటికీ రైతులకు పెట్టుబడి వ్యయం, తక్కువగా శ్రమ ఉంటుంది. దీనికి ఎర్ర, నల్లరేగడి నేలలు అను కూలం. దీంతో రైతులు ఈ పంటను ఎక్కువ పండించ డానికి జిల్లాలో ఆసక్తి చూపారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు వ్యవ సాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి వాటిని నివారించడానికి అవకాశం ఉంది.
సస్యరక్షణ నివారణ చర్యలు..
కందిలో మచ్చల తెగులు నివారణకు క్లోరిపైరిఫాస్ 20ఈసీ 2.5ఎంఎల్ లేదా ైస్టెనోసాడ్ 0.3మి.లీ లేదా లామ్డాసై హాలోథ్రిన్1.మి.లీ లేదా క్లోరంద్రనిలిప్సోల్ 0.3మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆశాజనకంగా దిగుబడి..
జిల్లాలో కంది పంట అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. రైతులు వానకాలంలో కంది, సోయాబీన్ పంటల్లో అంతర పంటగా సాగు చేశారు. అలాగే చాలా విస్తీర్ణంలో ప్లేన్గా కందివేశారు. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు అధిక దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చన్నారు.