ఇంద్రవెల్లి, అక్టోబర్ 20: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో సట్వాజీగూడ గ్రామానికి చెందిన సూర్యవంశీ సంజీవ్కుమార్కు రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి బాలేరావ్ ఉత్కార్ష్ కుటుంబాన్ని పరామర్శించి, దళితబంధు పథకంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మండలకేంద్రంలోని భీంనగర్కు చెందిన కేంద్రే శ్రీనివాస్ (బాబు) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇక్కడ పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఉప సర్పంచ్ గణేశ్ తైహిరే, టీఆర్ఎస్ మండలాధ్యక్షురాలు సోన్కాంబ్లే సుకేష్మ, నాయకులు దేవ్పూజె మారుతి, రాథోడ్ వసంత్రావ్, సునీల్, బాల్సింగ్, అంగద్ ఉన్నారు.
ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 20: అనారోగ్య బాధితులకు ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెంబి మండలం మందపెల్లికి చెందిన రవీందర్కు రూ. 60 వేలు, ఖానాపూర్ మండలం బావాపూర్కు చెందిన తిరుమలకు రూ. 14 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీవో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కొక్కుల ప్రదీప్, కౌన్సిలర్ తొంటి శ్రీనివాస్, సర్పంచ్లు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
కడెం, అక్టోబర్ 20: ఉడుంపూర్కు చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ను కలిశారు. ఆమె నలుగురు పిల్లలను చదివిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
దస్తురాబాద్, అక్టోబర్ 20 : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. పెర్కపల్లె, మున్యాల తండాలో బుధవారం ఆమె పర్యటించారు. పెర్కపల్లెలో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్యాల తండాలోని జగదాంబదేవి ఆలయం వద్ద సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించి, మొక్కలు నాటారు. పెర్కపల్లె పాఠశాల విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. మున్యాల తండాలోని జగదాంబదేవి ఆలయం వద్ద మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజునాయక్, సర్పంచులు దుర్గం శంకర్, సీదర్ల భూమేశ్, సురేశ్ నాయక్, అప్పని ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు నరేశ్, నారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య, నాయకులు రమేశ్ రావు, శ్రీనివాస్, రాజలింగం, శివయ్య, సత్తన్న, లక్ష్మీరాజం, రాజు, విలాస్ యాదవ్, నరేశ్, చందు నాయక్, గోపి, విజయ్ పాల్గొన్నారు.
వాహనాలు ప్రారంభం
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 20: లక్కారం గ్రామ పంచాయతీలో చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ నిధులు రూ.21 లక్షలతో కొనుగోలు చేసిన నూతన వాహనాలను బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, సర్పంచ్ రాథోడ్ జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఉప సర్పంచ్ కోల సత్తన్న, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, టీర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ పాల్గొన్నారు.