రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ట్రాన్స్జెండర్స్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం 13 మంది ట్రాన్స్జెండర్లను పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమించింది. కాగా, తమకు ఇది గొప్ప అవకాశమని ట్రాన్స్ జెండర్స్ చెబుతున్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన ఛత్తీస్గఢ్ పోలీస్ డిపార్టుమెంట్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు దక్కిన ఈ అద్భుత అవకాశం ద్వారా ప్రజలు తమ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని చూసే దృష్టి కోణం మారుతుందని భావిస్తున్నామని ఆ 13 మందిలో ఒకరైన సోనియా ఆశాభావం వ్యక్తంచేశారు.