నిర్మల్ టౌన్, డిసెంబర్ 17 : తెలంగాణ సర్కారు కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై సరత్రా చర్చ సాగుతున్నది. వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా బదిలీలకు ఆప్షన్ల గడువు మంగళవారంతో ముగిసింది. సీనియారిటీ స్థానికత ఆధారంగా బదిలీలు ఉండడంతో అన్ని శాఖల్లో సందడి కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 12న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేయగా.. అప్పట్లో ఉమ్మడి జిల్లా ఉద్యోగులను వివిధ జిల్లాలకు ఆర్డర్ టూ సర్వే ఆధారంగా సర్దుబాటు చేసింది. ఆ ఉద్యోగులందరూ ఆరేళ్ల నుంచి ఆయా జిల్లాల్లో పని చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జోన్లో ఉండగా.. ఇప్పుడు నిర్మ ల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలను బాసర జో న్లోకి.., కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కాళేశ్వరం జోన్లోకి మారాయి. కొత్త జోన్ల ప్రకారం.. ఉద్యోగుల బదిలీ చేపట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడంతో వారం రోజులుగా జిల్లాలోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జోరుగా సాగుతున్నది.
బదిలీలపై ఉత్కంఠ..
కొత్త జోన్ పరిధి ఏర్పాటు కావడంతో ప్రస్తుత బదిలీల ప్రక్రియ ఉత్కంఠకు గురిచేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యూనిట్గా కొత్తగా ఏర్పడ్డ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు బాసర జోన్.., కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కాళేశ్వరం జోన్లోకి రావడంతో మొదట కేడర్ నిర్వహించారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట స్థాయి కేడర్ను ఆయా శాఖల వారీగా నిర్దేశించిన జిల్లా అధికారులు, 16వ తేదీ వరకు సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వివిధ శాఖల్లో 30 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరుణంలో సర్దుబాటులో భాగంగా 6 వేల మందిని వివిధ జిల్లాలకు కేటాయించారు. వారిలో 4 వేల మంది ప్రమోషన్లు, ఇతర కారణాలతో సొంత జిల్లాలకు వెళ్లినప్పటికీ మిగతా 2 వేల మంది ఆర్డర్ టూ సర్వే ఆధారంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చేపట్టే బదిలీల్లో వీరికి అవకాశం లభించనున్నది. అలాగే దాదాపు 11,101 ఉపాధ్యాయ పోస్టులుండగా.. 9,356 మంది ఉద్యోగులు పని పనిచేస్తున్నారు. సుమారు 1745 ఖాళీలున్నట్లు అధికారులు తెలిపారు. వారికి కూడా సీనియారిటీ ప్రాతిపాదికన బదిలీలు చేపట్టనుండడంతో డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించుకున్నారు. అభ్యంతరాలు సైతం స్వీకరించి 20వ తేదీ నుంచి బదిలీలు చేపట్టేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నది. జిల్లాస్థాయిలో ఉమ్మడి జిల్లా కలెక్టర్ కన్వీనర్గా, ఆయా శాఖల అధికారులు సభ్యులుగా ఈ బదిలీల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో ఉద్యోగుల బదిలీపై సర్వత్రా చర్చ సాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించిన జిల్లా అధికారులు వారి సీనియారిటీ లిస్టు ఆధారంగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు.