ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 17 : ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి జెల్లా అమన్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 సాధించి జిల్లా టాపర్గా నిలిచాడు. దీంతో కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం అమన్ను సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వ కళాశాల విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీఐఈవో శ్రీధర్ సుమన్, అధ్యాపకులు ఉన్నారు.
జిల్లా టాపర్లను సన్మానించిన డీఐఈవో
ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులను డీఐఈవో శ్రీధర్ సుమన్ సన్మానించారు. కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి జెల్లా అమన్ 470 మార్కులకు 466 , ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రణయ్ ఒకేషనల్ గ్రూపులో 500 మార్కులకు 430 , నర్సింగ్ గ్రూపులో రజిత 500 మార్కులకు 404, ప్రభాకర్ ఎంపీసీలో 395, వాంకిడి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పవన్ ఎంపీసీలో 432, అశ్విని బైపీసీ లో 422 మార్కులను సాధించినట్లు డీఐఈవో తెలిపారు. సెకండియర్లోనూ రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ రాందాస్ , అద్యాపకులు శ్రీనివాస్, సతీశ్, శైలేశ్, అఫ్రోజ్, మంగ ఉన్నారు.
రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. సావిత్రీ బాయి జయంతి సందర్భంగా సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో జనవరి 3న కాగజ్నగర్ విజేత దవాఖానలో తలపెట్టిన రక్తదాన శిబిరం పోస్టర్ను తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో మనోహర్ , బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ నాగమణి , డాక్టర్ మ హేశ్, నిర్వాహకులు , సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్చార్జి దిలీప్కుమార్, సునీల్ , సంతోష్, అరుణ్, ప్రభాకర్, తదితరులు ఉన్నారు.