నిర్వాహకులు శిక్షణకు హాజరవ్వాలి
డీఐఈవో శ్రీధర్ సుమన్
హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచన
ఆసిఫాబాద్, అక్టోబర్17 : ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు సంబంధించిన సామగ్రి తీసుకెళ్లాలని నిర్వాహకులకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీఐఈవో శ్రీధర్సుమన్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పరీక్ష సామగ్రిని ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 పరీక్షా కేంద్రాలకు సమాధాన పత్రాలు, ఓఎంఆర్ కార్డులు తదితర సామగ్రి చేరుకుందని పరీక్షల నిర్వాహకులు ఈ నెల 18, 19 తేదీల్లో తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో జనరల్లో 4326, వొకేషనల్ కోర్సులో 882 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లు, నామినల్ రోల్స్, ఫొటో, హాజరు షీట్లు, డీ ఫారాలను కళాశాల నుంచి లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చని, విద్యార్థులు సైతం బోర్డు సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్ష నిర్వాహకులు ఈ నెల 20న శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు.