ఒకే వేదికపై 33 దుర్గమ్మల ఏర్పాటు
10 వరల్డ్ రికార్డులు సొంతం
నిర్మల్ అర్బన్, అక్టోబర్17 : జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో మహదేవ్ శక్తి సంస్థాన్ శివరాజయోగి కృష్ణ స్వామి ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా ఒకే వేదికపై 33 దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినందున భారత్ వరల్డ్ రికార్డులో పాటు 10 ప్రపంచ రికార్డులు వచ్చాయి. ఈనెల 7నుంచి 15 వరకు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకే వేదికపై 32 దుర్గామాత విగ్రహాలు, కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి భక్తి భావాన్ని పెంపొందించినందుకు గాను భారత్ వరల్డ్ రికార్డు మెంబర్ లయన్ కేవీ రమణమూర్తి, నేషనల్ కో ఆర్డినేటర్ మారుతి వరుణ్ ఆదివారం వరల్డ్ రికార్డును అందజేశారు. వీటితో పాటు వరల్డ్ రికార్డు, సంస్కృతీ సంప్రదాయ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, సనాతన ధర్మ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ట్రెడిషనల్ వరల్డ్ రికార్డు, టెంపుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, డివోషనల్, స్పిరిట్యువల్ బుక్ ఆఫ్ అవార్డు, కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు వరల్డ్ రికార్డు, వరల్డ్ రికార్డ్ బుక్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కృష్ణ స్వామి మాట్లాడారు. నిస్వార్థంతో, భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయని అన్నారు. ప్రపంచ రికార్డులు నిర్మల్ జిల్లాకు గర్వ కారణమని, వీటిని జిల్లాకు అంకితం ఇస్తున్నానని తెలిపారు.