డీఎంహెచ్వో మనోహర్ పెంచికల్పేట్ పీహెచ్సీ తనిఖీ
పెంచికల్పేట్, ఆగస్టు 14 : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలో వైద్య శిబిరాలు, పారిశుధ్యంపై స ర్పంచ్ల సమన్వయంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామం మ్యాప్ తయారు చేసి అక్కడ ఉండే మురుగు నీటి నిల్వల ప్రదేశాలను గుర్తించి ఏఎన్ఎం, ఆశ, అంగన్వా డీ, ఆయా, పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి వారంలో రెండు రోజులు డ్రై డే చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీలో 15 రోజుల్లోగా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. కేంద్రం సి బ్బంది స్థానికంగా ఉంటూ సమయపాలన పా టించి విధులు నిర్వహించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం దవాఖాన సిబ్బంది డీఎంహెచ్వోను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి సుధాకర్నాయక్, డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం, ప్రోగ్రాం అధికారి ప్రేమ్సాగర్, స్థానిక వైద్యాధికారి ముస్తఫా, హెచ్ఈవో కోటేశ్వర్రావు, హెచ్ఎస్లు లతశ్రీ, రవిదాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.