బోథ్, అక్టోబర్ 13: పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే బాపురావ్ అన్నారు. బుధవారం బోథ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోథ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ 9,01,044 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ , సీఎంఆర్ఎఫ్ కింద బోథ్కు చెందిన సత్యనారాయణకు మంజూరైన రూ 21 వేల చెక్కులను అందజేశారు. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ భోజన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, టీఆర్ఎస్ కన్వీనర్ రుక్మణ్సింగ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సర్పంచ్ సురేందర్యాదవ్, నారాయణరెడ్డి, మణీందర్సింగ్, జుగధిరావు, ఉమేశ్, రోహిదాస్, ప్రశాంత్, రాజు, సంజీవ్రెడ్డి, నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఏఎస్వో సురేశ్, గిర్దావర్ దశరథ్, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.
దుర్గమ్మకు ఎమ్మెల్యే పూజలు
బోథ్లో దుర్గామాతకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. వేద పండితుడు సదానందశర్మ అమ్మవారి ప్రసాదం అందించారు.
భక్తిమార్గంలో నడవడం అభినందనీయం
తాంసి, అక్టోబర్ 13: నేటి యువత భక్తిమార్గంలో నడవడం అభినందనీయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం పొన్నారిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యువకులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ రేఖా రఘు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమణ, మాజీ సర్పంచ్ భోజన్న యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రమేశ్, విలాస్, మల్లయ్య, చంద్రన్న, దేవేందర్, దయానంద్, శంకర్ పాల్గొన్నారు.
దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే
తలమడుగు అక్టోబర్ 13 : దేవాపూర్ గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గామాతను బుధవారం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువజన సంఘాల సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి దర్శించుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ఝరి పీఎసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కిరణ్కుమార్, అబ్దుల్లా, సంతోష్, ఆశన్నయాదవ్, మగ్గిడి ప్రకాశ్, రాంబాయి, పల్లవి పాల్గొన్నారు.