అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి
చేడ్వాయి, ఎల్కపల్లి, ఎల్లూర్ గ్రామాల్లో పర్యటన
పెంచికల్పేట్, ఆగస్టు 13 : పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని చేడ్వాయి, ఎల్కపల్లి, ఎల్లూర్ గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లూర్, ఎల్కపల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ ల్లూర్ సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసు జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్లదేనని పేర్కొన్నారు. అనంతరం ఎల్కపల్లి యువకుడు సారంపల్లి మల్లేశ్ వీధిలో ఏడు కరంటు స్తం భాలు వేయాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మ్యాప్ సిద్ధం చేసి విద్యుత్ అధికారులతో మా ట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్లూర్ సర్పంచ్ దుర్గం రాజన్న, మండల కోఆప్షన్ సాజీద్, వార్డు సభ్యులు చంద్రకాంత్, నాయకులు చౌదరి శ్రీను,బండు, నాగన్న, సత్యనారాయణ, విశ్వేశ్వర్, సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భట్టుపల్లిలో పర్యటన..
కాగజ్నగర్ రూరల్, ఆగస్టు 13: మండలంలోని భట్టుపల్లి గ్రామాన్ని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి సందర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని, రోడ్లపై గుంతల్లో మట్టి వేసి పూడ్చాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నారా.. అని కార్యదర్శి సుని తను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.