దండేపల్లి, అక్టోబర్ 10 : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని రెబ్బెన్పెల్లిలో రూ.5లక్షలతో నిర్మించిన డ్వాక్రా సంఘ భవనాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. మహిళలు సంఘాల ద్వారా స్వయం ఉపాధి రంగాల్లో రాణించి, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. గ్రామానికి మంజూరైన వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, సర్పంచ్ కందుల కల్యాణి, ఎంపీటీసీ బత్తుల మౌనిక, వివిధ గ్రామాల సర్పంచ్లు జాడి తిరుపతి, విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివా స్, పీఆర్ జేఈ తివారీ, టీఆర్ఎస్ నాయకులు బండారి మల్లేశ్, కందుల అశోక్, బత్తుల శేఖర్, గోళ్ల రాజమల్లు, శంకర్రావు, మైదం గంగారెడ్డి, కొట్టె సత్తయ్య, గాండ్ల నరేశ్, బోడ నర్సింగ్, యెలుగూరి వేణు, మగ్గిడి శ్రీనివాస్, గొల్లపెల్లి అజయ్, పత్తిపాక సంతోష్, నలిమెల మహేశ్, పిట్టల అశోక్, ఎల్ బాపు, అఫ్సర్, ఒడ్డె ప్రభాకర్, బండ రాకేశ్, జాడి ఇసాకర్, నలిమెల సుధీర్ వర్మ, ఐకేపీ ఏపీఎం, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు ఉన్నారు.