అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి
కౌటాల, మొగఢ్దగఢ్, విర్దండి గ్రామాల్లో పర్యటన
కౌటాల, ఆగస్టు 10 : పల్లె ప్రగతి పనులపై నిర్ల క్ష్యం వద్దని అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం కౌటాల, మొగఢ్దగఢ్, విర్దండి గ్రా మాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మొగఢ్దగఢ్ గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ పా రిశుధ్య పనులు పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పారిశుధ్య పనులు సక్ర మంగా నిర్వహించడం లేదని, ఎవరైనా అధికారు లు వస్తేనే కార్యదర్శి వస్తాడని, మరుగుదొడ్లు ని ర్మించుకున్న లబ్ధిదారుల డబ్బులు సొంత ఖ ర్చు లకు వాడుకున్నాడని ఆయన దృష్టికి తీసు కెళ్లారు. డ్రైనేజీలను శుభ్రం చేయకుండా ఏం చేస్తున్నారని కార్యదర్శి వెంకటేశ్, సర్పంచ్ జీజాబాయిని ప్ర శ్నించారు. పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విర్దండి గ్రా మంలో వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌటాల పీహెచ్సీని సం దర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్ర జలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారి కృష్ణప్రసాద్కు సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీడీవో నస్రుల్లా ఖాన్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఏపీ వో పూర్ణిమ, తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 10: పట్టణ సుందరీకరణలో భాగంగా కాగజ్నగర్లో చేపడుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. సర్సిల్క్, గాంధీపార్కు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వేస్తున్న రంగులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, సిబ్బంది ఉన్నారు.