మంచిర్యాల అర్బన్, మార్చి 18 : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్దూ/హిందీ) పరీక్ష రాశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య జిల్లా కేంద్రంలోని చెన్నూర్ రోడ్ పాఠశాల, ఆర్బీహెచ్వీ, జడ్పీ బాలుర పాఠశాల, కృష్ణవేణి పాఠశాలలతో పాటు మందమర్రిలోని సింగరేణి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీజీఈ దామోదర్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
మొదటి రోజు 99.70 శాతం మంది వి ద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు మొత్తం 9,306 మంది విద్యార్థులకుగాను, 9,278 మంది హాజరయ్యారు.
నెన్నెల,మార్చి18 : మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలోని కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దర్ రమేశ్, ఎంపీడీవో దేవెందర్రెడ్డి ఉన్నారు.
ఆసిఫాబాద్,మార్చి18 : జిల్లా వ్యాప్తంగా 37 కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,457 మంది విద్యార్థులకుగాను, 6,408 మంది హాజరయ్యారు. పలుచోట్ల కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే, ఎస్పీ సురేశ్కుమార్ సందర్శించారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. వారివెంట ఎస్బీ సీఐ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ సతీష్ ఉన్నారు.
కెరమెరి, మార్చి 18: కెరమెరి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాల, మోడీలోని ఆశ్రమ ఉన్న త పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయిన్నట్లు సీఎస్ స్వర్ణలత తెలిపారు.