ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
భైంసా, కుభీర్లో చెక్కుల పంపిణీ
భైంసా, నవంబర్ 8 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నా రు. భైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో 185 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. రూ.1,00,116 అందించి ప్రభుత్వం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ విశ్వంభర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ఎంఐఎం కౌన్సిలర్లు ఫయాజుల్లాఖాన్, అమీర్, టీఆర్ఎస్ నాయకుడు సాహెబ్ రావు, సర్పంచ్లు పాల్గొన్నారు.
ఆలయ పునర్నిర్మాణానికి కృషి
కుభీర్, నవంబర్ 8 : కుభీర్లోని ప్రాచీన శ్రీ విఠలేశ్వరుడి ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవిఠలేశ్వర ఆలయ ఆవరణలో దేవాదాయశాఖ నిధులు రూ.23 లక్షలతో నిర్మించిన మండపాన్ని, ఆలయ కమిటీ నిర్మిస్తున్న గదుల నిర్మాణ పనులకు సోమవారం ఆయన స్థానిక సర్పంచ్ పీ మీరా విజయ్కుమార్, జడ్పీటీసీ అల్కాతాయి సంజయ్ చౌహాన్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కుభీర్లోని అన్ని పార్టీల నాయకులు ఆలయ అభివృద్ధి కోసం ఐకమత్యంతో పాటుపడడంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నారా పరశురాం, బచ్చు ప్రసాద్ బృందం శాలువా, పూలమాలలతో సత్కరించారు. వైస్ ఎంపీపీ మొహియోద్దీన్, ఎంపీటీసీ పోసాని, ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్, సింగిల్ విండో చైర్మన్ రేకుల గంగాచరణ్, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నీల అనిల్, సాయిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, కాంట్రాక్టర్ రవూఫ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మాజీ ఎంపీపీ బోయిడి విఠల్, డాక్టర్ పీ శివురాం, మాజీ సర్పంచ్ గోరేకర్ బాబు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దొంతుల రాములు, గాడేకర్ రమేశ్, గోనే కల్యాణ్, సూది రాజన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, పాండురంగడి భక్తులు, వార్ఖరీ భక్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
113 మందికి చెక్కుల అందజేత..
కుభీర్లోని ఐకేపీ కార్యాలయంలో మండలానికి చెందిన 113 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠల్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను (ఒక్కొక్కరికి 1,00,116) అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ చందర్, గిర్దావర్ వెంకట రమణ, జడ్పీటీసీ అల్కాతాయి సంజయ్ చౌహాన్, సర్పంచ్ మీరా విజయ్కుమార్, నాయకులు పాల్గొన్నారు.