పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
దసరా తర్వాత దరఖాస్తులు స్వీకరించనున్న ఎమ్మెల్యేలు
నెరవేరనున్న గిరిజనుల కల.. సర్వత్రా హర్షాతిరేకాలు
ఇంద్రవెల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆదిలాబాద్, అక్టోబర్ 6 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అడవిబిడ్డల కల నెరవేరబోతున్నది. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తుండగా, దసరా తర్వాత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని సర్కారు ప్రకటించింది. పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత యంత్రాంగం పట్టాలు జారీ చేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఏళ్లకేళ్లుగా తమ భూములకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తమకు మేలు జరుగుతుందని గిరిజనం మురిసిపోతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉం టారు. వీరంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. పట్టాలున్న గిరిజనులు సర్కారు అందిస్తున్న సాయం తో తమ భూముల్లో పంటలు పండిస్తూ ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లోని ఆదివా సీ గూడేలు, గిరిజన తండాలకు ఆనుకొని ఉన్న ఖాళీ భూ ము లు, అడవులు నరికివేతకు గురైన భూముల్లో కొందరు ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో పోడు వ్యవసాయం చేస్తున్న కొం దరి రైతులకు అప్పటి ప్రభు త్వం అటవీ హక్కు పత్రాలను అం దజేసింది. ఉమ్మడి జిల్లాలో 1,36,117 ఎకరాల్లో పంట లు పండిస్తున్న 37,324 మంది రై తులకు ప్రస్తుతం హక్కు పత్రా లు ఉన్నాయి. ఆదిలాబాద్ జి ల్లాలో 17,657 మంది రైతులకు 69,654 ఎకరాలు, ఆసిఫాబా ద్ జిల్లాలో 12,635 మం ది రైతులకు 46,329 ఎకరాలు, నిర్మ ల్ జిల్లాలో 5500 మం ది రైతులకు 16,589 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1532 మంది రైతులకు 3544 ఎకరాలకు సం బంధించిన హక్కు పత్రాలను అందజేశారు. ప్రత్యేక రాష్టం ఏర్ప డి.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత హక్కు పత్రాలున్న గిరిజన రైతులందరికీ రైతుబంధు పథకం వర్తింపజేస్తున్నారు. రెండు సీజన్లకుగానూ రూ.136.11 కోట్ల రైతుబంధు డబ్బులను వారి బ్యాం కు ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో పంట పెట్టుబడితో గిరిజన రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
పోడు భూముల సమస్యకు పరిష్కారం
రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప ట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించా రు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్యకు పరిష్కారం లభించనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 వేలకు పైగా రైతులు లక్ష నుంచి 1.25 లక్షల ఎకరాల్లో పో డు వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నా రు. ఏజెన్సీ మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో అటవీభూముల్లో గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పోడు వ్యవసాయం కారణంగా పలు సమస్యలు వస్తున్నా యి. అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అక్కడికి వెళ్ల డం.. రైతులు అడ్డుకోవడంలాంటి ఘటన లు జరుగుతున్నాయి. ఈ భూములు సాగు చేస్తున్న వారికి బ్యాంకు రుణాలు, ఇతర సా యం కూడా లభించదు. సీఎం తీసుకున్న నిర్ణయంతో పోడు వ్య వసాయం చేస్తున్న రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నా యి. దసరా తర్వాత రైతు ల నుంచి ఆయా నియోజకవర్గాల ఎ మ్మెల్యేలు దరఖాస్తులు తీసుకుంటారు. పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అధికారులు అర్హులైన వారికి పట్టాలు జారీ చే స్తారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తమకు సాయం అందడం తో పాటు ఇ తర ప్రయోజనాలు చేకూరే అవకాశముందని గిరిజ న రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇంద్రవెల్లిలో సీఎం చిత్రపటానికి గిరిజన రైతులు క్షీరాభిషేకం చేశారు.