నివాళులర్పించిన మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్లు భారతీ హోళికేరి, రాహుల్రాజ్
మందమర్రి ఆగస్టు 6: పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో జయశంకర్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్ నల్లాల ఓదెలు టీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో జయశంకర్ సార్ ఆశయాలు, సిద్దాంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొంగల తిరుపతిరెడ్డి, ఈశ్వర్, బోరిగం వెంకటేశ్, రాకం సంతోష్, బత్తుల శ్రీనివాస్, బండారి సూరిబాబు, సామల సత్యనారాయణ, ఈర్ల రాజేశ్, సాయిని చంద్రమోహన్, టీబీజీకేఎస్ నాయకులు బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, సీవీ రమణ, భూపెల్లి కనకయ్య, సామంతుల స్వామి, యుగేందర్, వ్యాపార సంఘం అధ్యక్షుడు కనకయ్యగౌడ్, మహిళా నాయకులు ఎనగందుల లక్ష్మి, ఈశ్వరీ, సరిత, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయంలో..
కాగజ్నగర్ టౌన్, ఆగస్టు 6 : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సార్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో చిత్రు, తహసీల్దార్ ప్రమోద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టర్లో ..
హాజీపూర్, ఆగస్టు 6 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ భారతీ హోళికేరి అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్తో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి సురేశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.