నేడు సామల సదాశివ మాస్టారు 10వ వర్ధంతి
11న కాగజ్నగర్లో విగ్రహావిష్కరణ
ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 6 : సామల సదాశివ మాస్టారు.. ఈ పేరు వింటే నే సాహితీ అభిమానులు, వర్తమాన కవులు, రచయితల మదిలో తెలియ ని గురుభక్తి వెల్లివిరుస్తుంది. ఆ మహనీయుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లినా.. మా స్టారు రచనలు ఆయనను ఎప్పుడూ అజరామరంగానే నిలుపుతాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో హైదరాబాద్లో నభూతో న భవిష్యత్ అన్నట్లు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో నూ సదాశివ పేరిట ఏర్పాటు చేసిన వేదికపై మహామహులు కవితలు వినిపించారు.. సందేశాలిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్సార్, సీఎం కేసీఆర్ సదాశివ మాస్టారును తమ గురువుగా చెప్పిన ఉదంతాలున్నాయి. మాస్టారు స్వర్గస్తుడై దశాబ్దం అవుతున్నా.. జ్ఞాపకాలు సదా పదిలమే. అవి వర్తమాన కవి, రచయితలకు నిత్యనూతన పాఠాలే. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సదాశి వ పదో వర్ధంతిని శనివారం ఆయన ఇంటి వద్దే నిర్వహించుకోనున్నారు.
సదాశివ మాస్టారు దహెగాం మండలం తెనుగుపల్లెలో 1928, మే 11న నాగయ్య, చిన్నమ్మ దంపతులకు జన్మిం చారు. ఆదిలాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎంఏ, బీఎడ్ చేసి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై పట్టు, ఆసక్తి ఉండేవి. తెలుగుతో పాటు పలు భాషలను నేర్చుకున్నారు. మాస్టారు అడుగుజాడల్లో కుటుం బం కూడా సాహితీ కుటుంబంగానే వర్ధిల్లుతున్నది.
11న సిర్పూర్ కాగజ్నగర్లో విగ్రహావిష్కరణ..
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అక్కడ మాస్టారుపై అభిమానంతో, గురుభక్తిగా విగ్రహం తయారు చేయించారు. ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 11న నిర్వహించే అవకాశం ఉన్నదని మాస్టారు కుమారుడు సామల రాజవర్ధన్ తెలిపారు.