రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
బెల్లంపల్లి, మంచిర్యాలలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం
పాల్గొన్న ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్రావు
బెల్లంపల్లి టౌన్ / కాసిపేట, సెప్టెంబర్ 5 : టీఆర్ఎస్ పటిష్టత కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చే యాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మం త్రి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, బెల్లంపల్లి ఇన్చార్జి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయడంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అ ధ్యక్షతన నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె హాజరై ప్రసంగించారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకొని 21వ సంవత్స రంలోకి వెళ్తున్నామని, 10 మందితో జలదృశ్యం లో ప్రారంభం కాగా, ప్ర స్తుతం 60 లక్షలకు పైగా కుటుం బ సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నా రు.టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం గతేడాది బీ మా కోసం రూ.16 కోట్లు, ఈ ఏడాది రూ.18 కోట్లు ప్రీమియం చెల్లించిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం చేస్తున్నామని, టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు గర్వించాలన్నారు. మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం చూడలేని కబోదీలుగా మారాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లుగా ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని, అసాధ్యం అనుకున్న కాళేశ్వరాన్ని సు సాధ్యం చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తే రాద్ధ్దాంతం చేస్తున్న ప్రతిపక్షాలు దీనిపై వారి వైఖరి స్ప ష్టం చేయాలన్నారు. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ బ లంగా ఉంటుందని, ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ నెల చివరి వరకు సం స్థాగత నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బండి సంజయ్ , రేవంత్ రెడ్డి అబద్దపు ప్రచారాలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోని, ఎక్కడికక్కడ నిలదీయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గతంలో గ్యాస్ ధర రూ.420 ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రూ.1000 అయ్యిందని, సిగ్గు లేకుండా ఇంకా పాదయాత్రలు చేస్తున్నారన్నారు. ఫారెస్ట్ చట్టం కేంద్ర పరిధిలో ఉందని, దమ్ముంటే అక్కడికి వెళ్లి చట్టం మార్చేందుకు కృషి చేయాలని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. సీఎం కేసీఆర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హె చ్చరించారు. కష్టపడే వారికి తప్పకుండా అవకా శం వస్తుందని, గడువులోగా పార్టీ కమిటీలు వేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స త్యవతి రాథోడ్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. జన్నారం మండలం మొర్రిగూడెంకు చెందిన బదావత్ రామకృష్ణ, కొలంగూడ పాఠశాలలో సీఆర్టీగా విధులు నిర్వహించి ఇటీవల మృతి చెందగా, ఆయన భార్య, పిల్లలతో పాటు కు టుం బ సభ్యులు బెల్లంపల్లిలో మంత్రిని కలిశారు. సీఆర్టీగా అవకాశం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రం థాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చై ర్మన్ జక్కుల శ్వేత, గడ్డం భీమా గౌడ్, వైస్ చైర్మన్ సుదర్శన్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సర్పంచ్లు కొరికొప్పుల ప్రమీలాగౌడ్, ద రావత్ దేవి, ఆడె బాదు, ఎంపీటీసీలు కొండబత్తు ల రాంచందర్, చంద్రమోళి, చింతల భీమ య్య, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, వాస్దేవ్, జాడి శివ, రంగు రవి తేజ, అగ్గి సత్తయ్య, వడ్లూరి మల్లేశ్, రాజేశం, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుపేదల మనసు గెలుచుకోవాలి..
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 5: నిరుపేదల మనసును గెలుచుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని మంత్రి సత్యవతి రాథోడ్ అ న్నారు. పట్టణంలోని 27 వార్డు గౌతమీనగర్లో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశంలో ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కు దిక్కులేక టీడీపీ నుంచి రేవంత్ను తీసుకువచ్చి రాష్ట్ర బాధ్యతలు అప్పగించిందని, దీంతో ఆ పార్టీ తర్వలోనే పూ ర్తి గా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేలను అమ్మివేస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా బండి సంజయ్ పాదయాత్ర, ధర్నాలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడు తూ పదవులు రాలేదని నిరుత్సాహం చెందవద్దని, పదవులు వాటంతటవే వస్తాయని చెప్పారు. సం క్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం వార్డు కమిటీ బాధ్యులు గా ఎన్నికైన సభ్యులకు మంత్రి పుష్పగుచ్ఛం అం దించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెటం రాజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి ట్రస్టు చైర్మన్ విజిత్రావు, కౌన్సిలర్లు సిరికొండ పద్మ కొండాల్రావు, చైతన్యరెడ్డి, మహేశ్వరి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, పీఏసీఎస్ చై ర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు అత్తి సరో జ, గోగుల రవీందర్రెడ్డి, తోట తిరుపతి, గొంగళ్ల శంకర్, కొండాల్రావు, జగన్మోహన్రా వు, జ య రామారా వు, పల్లపు తిరుపతి, శంకర్, వెంకటేశ్వరరావు, సత్యపాల్రెడ్డి, హన్మంతరావు పాల్గొన్నారు.