జైనథ్, జూన్ 3 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలకేంద్రంలో 171 వ్యవసాయ పనిముట్ల ను అన్నదాతలకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్గంగపై చెనాక కోర్ట వద్ద బ్యారేజీ నిర్మించి 51 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. త్వరలోనే జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. అనంతరం మండలకేంద్రంలో 49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్. లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలురి గోవర్ధన్రెడ్డి, తహసీల్దార్ మ హేంద్రనాథ్, ఎంపీడీవో గజానన్, ఏవో వివేక్, స ర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
చెక్డ్యామ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
ఆదిలాబాద్ రూరల్, జూన్ 3: చెక్డ్యామ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని యాపల్గూడ, చాందా, భీంసరిల్లో చేపట్టిన చెక్డ్యామ్ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వందలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సుమారు రూ.16 కోట్లతో చెక్డ్యామ్లు నిర్మిస్తున్నామన్నారు. నాణ్యమైన పనులు జరిగేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్లు గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు సెవ్వ జగదీశ్ పాల్గొన్నారు.