రెబ్బెన, అక్టోబర్ 2 : బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు చీరెలను తెలంగాణ సర్కారు పంపిణీ చేస్తున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. వివిధ రంగులు, డీజైన్లతో అందమైన చీరెలను అందుకొని సంబురపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, సర్పంచ్ బొమ్మినేని అహల్యదేవి, ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంఘం శ్రీనివాస్, ఆలయ డైరక్టర్ వినోద్జైస్వాల్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మాజీ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, వార్డు సభ్యులు దుర్గం భరద్వాజ్, రాజేశ్, రమేశ్, గోపి, హన్మంతు, సత్తమ్మ, బయ్యా, సునీత, యశోద, శాంతబాయి, నాయకులు జుమ్మిడి ఆనందరావు, దుర్గం రాజేశ్, రాపర్తి అశోక్, మన్నెం పద్మ, అన్నపూర్ణ అరుణ, లత, తదితరులు పాల్గొన్నారు.
జైనూర్ మండలంలో..
జైనూర్, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ హాజరై ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి జడ్పీ చైర్పర్సన్ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, ఎంపీడీవో ప్రభుదయ, తహసీల్దార్ సాయన్న, సీడీపీవో ఇందిరమ్మ, ఏపీఎం సుజాత, వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, సహకార సంఘం చైర్మన్ కోడప హన్నుపటేల్, ఎంపీటీసీలు భగవంత్రావు, జు గాదిరావు, సర్పంచులు లక్ష్మణ్, భీంరావు తదితరులున్నారు.
ఆడ బిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కోనప్ప
కాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్ 2: రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొని యాడారు. శనివారం మున్సిపల్ పరిధిలో పొట్టి శ్రీరాములు చౌరస్తా, మండలంలోని కోసిని గ్రామంలో బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, కమిషనర్ సీవీఎన్ రాజు, కౌన్సిలర్లు విద్యావతి, బంక శివ, మహిళలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
కోట్లాది రూపాయల వ్యయంతో చీరెల పంపిణీ
-మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 2: తెలంగాణలో అతిపెద్ద పండుగైనా బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రతి ఏటా 350 కోట్లతో 1.08 కోట్ల మందికి బతుకమ్మ చీరెలు అందజేస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్కాలనీ, విద్యానగర్, సీసీసీ, కృష్ణాకాలనీ, ఆర్కే-6 గుడిసెలు, శ్రీరాంపూర్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో 5వ దఫా మహిళల కోసం చీరల పంపిణీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, జబీన్హైమద్, బండి పద్మ, కుర్మిళ్ల అన్నపూర్ణ, పంబాల గంగా, బెడికె లక్ష్మి, బౌతు లక్ష్మి, పూదరి కుమార్, చిడం మహేశ్, కో ఆప్షన్ సభ్యులు ముత్తె రాజేశం, నాసర్, నాయకులు మెరుగు పవన్కుమార్, మల్లెత్తుల రాజేంద్రపాణి, రౌతు రజిత, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, అన్నయ్య, మోతె కనుకయ్య, గర్శె భీమయ్య, చల్ల విక్రం, గరిసె రామస్వామి, వేల్పుల రవీందర్, దగ్గుల మధు, గౌస్, పెంచాల వేణు, ఎండి సమ్మయ్య, జక్కుల రాజేశం, కుర్మిళ్ల మోహన్, తదితరులు పాల్గొన్నారు.
ఆడబిడ్డల సంక్షేమానికి సర్కారు కృషి
మంచిర్యాలటౌన్, అక్టోబర్ 2: ఆడబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, బతుకమ్మను సంతోషంగా నిర్వహించుకోవాలని ఉద్దేశ్యంతో చీరెలు పంపిణీ చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని ఏసీసీ ఏరియాలో బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే, కలెక్టర్ చీరెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 2: మున్సిపాలిటీ పరిదిలోని ఇటిక్యాల హైస్కూల్లో, ఉత్కూర్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో , ప్రభుత్వ బాలికల పాఠశాల బస్టాండ్ వద్ద మూడు సెంటర్లలో బతుకమ్మ చీరెలను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో రూ. 2 కోట్లతో అంతర్గత రోడ్లను త్వరలోనే నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాం తయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మండల తహసీల్దార్ వేముల రాజ్కుమార్, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ గడికొప్పుల ఉమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ కాంతయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు గడ్డం వికాస్, పార్టీ నాయకులు గరిసె రవీందర్, దొంత నర్సయ్య, కాంతయ్య తదితరులున్నారు.