నెలరోజులు వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఆసిఫాబాద్ టౌన్,సెప్టెంబర్ 2: పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోషణ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. జి ల్లాలోని గిరిజన తండాల్లో పోషణ మాసం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో పోషణ కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో పాటు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు. శుక్రవారం నుంచి పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అధ్యక్షతన పోషణ, శానిటైజేషన్ కోసం వివిధ శాఖలతో కమిటీలు వేసినట్లు చెప్పా రు. 15 రోజులకోసారి సమావేశమై పురోగతిపై చర్చించాలన్నారు. అక్టోబర్ 2 నాటికి డిజిటల్ క్లాసులు నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నామని చెప్పారు. మండలానికి మూడు చొప్పున అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి, స్మార్ట్ టీవీలను అందజేయడంతో పాటు ఏడాదికి సరిపడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. పిల్లలకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, వైద్యాధికారి మనోహర్, పంచాయతీ రాజ్ ఈఈ రామ్మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.