రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి
రైతులకు వ్యవసాయాధికారులు, పోలీసుల సూచన పలు దుకాణాల్లో తనిఖీలు
ఆదిలాబాద్ రూరల్ జూన్ 2: వానకాలం సాగులో భాగంగా విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలని మండల వ్యవసాయాధికారి అశ్రఫ్ సూచించారు. మండలంలోని భీంసరి గ్రామ రైతువేదికలో రైతులకు విత్తనాల ఎంపిక, ఎరువుల లభ్యత, తదితరాలపై బుధవారం అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు సూచనల ప్ర కారం విత్తనాలు ఎంపిక చేసుకొని ముందుకు సాగితే మం చి దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు. విత్తనాలు కొ న్న తర్వాత సదరు వ్యాపారి నుంచి తప్పకుండా రసీదు తీ సుకోవాలని సూచించారు. సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 2: విత్తనాలు, ఎరువులు, పురుగు మం దుల దుకాణాదారులు విత్తన చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని బోథ్ వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకుడు జీ శ్రీధర్స్వామి హెచ్చరించారు.
బుధవారం బోథ్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారి వెండి విశ్వామిత్ర, ఎస్ఐ రాజుతో కలిసి తనిఖీ చేశా రు. రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలు, పురుగు మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉట్నూర్, జూన్ 2: మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను ఎస్ఐ సుబ్బారావు, వ్యవసాయశాఖ అధికారి గణేశ్తో కలిసి బుధవారం తనిఖీ చేశారు. విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అ మ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయశాఖ అధికారులు, ట్రైనీ ఎస్ఐ రాజమణి ఉన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 2: ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలతోపాటు ఎరువులు, మందులను మాత్రమే విక్రయించాలని ఉట్నూర్ సీఐ నరేశ్ కుమార్ వ్యాపారులకు సూచించా రు. మండలంలోని పత్తి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే దుకాణాలను బుధవారం ఎస్ఐ నాగ్నాథ్తో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించా రు. దుకాణాల్లో నకిలీ పత్తి విత్తనాలపై ఆరాతీశారు. రైతు లను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.