అపోహలు వీడాలి
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
వ్యాక్సినేషన్ కేంద్రాల పరిశీలన
తాండూర్, సెప్టెంబర్ 30 : టీకా వేసుకుంటేనే కరోనా నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. గురువారం మండలంలోని నీలాయపల్లిలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాలకే వచ్చి టీకాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వడ్డెర కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులను పలు ప్రశ్నలు అడిగి వారితో ముచ్చటించారు. బాగా చదువుకోవాలని చిన్నారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ..
మండలంలోని నీలాయపల్లి సర్పంచ్ రేపాక సునీత రమేశ్ తల్లి ఇటీవల మరణించగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సర్పంచ్ కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.